1ఇశ్రాయేలు ప్రజలారా, యెహోవా మాట ఆలకించండి.
2అబద్ధసాక్ష్యం పలకడం, అబద్ధమాడడం.
3కాబట్టి దేశం ఎండిపోతూ ఉంది.
4ఒకడు మరొకడిపై వ్యాజ్యం వెయ్యనివ్వవద్దు.
5యాజకులు పగటి వేళ కూలిపోతారు. రాత్రివేళ నీతోబాటు ప్రవక్తలు పడిపోతారు.
6నా ప్రజలు అజ్ఞానం వల్ల నశిస్తున్నారు. ఎందుకంటే వారు జ్ఞానాన్ని తిరస్కరించారు.
7యాజకుల సంఖ్య ఎక్కువైన కొద్దీ వారు నా పట్ల అధికంగా పాపం చేశారు.
8నా జనుల పాపాలను ఆహారంగా చేసుకుంటారు గనక ప్రజలు మరింతగా పాపం చేయాలని వారు చూస్తారు.
9కాబట్టి జనులకు ఎలాగో యాజకులకూ అలాగే జరుగుతుంది.
10వారు నాకు, అంటే యెహోవాకు దూరమయ్యారు. నన్ను విడిచిపోయారు.
11లైంగిక విచ్చలవిడితనం, ద్రాక్షామద్యం, కొత్త ద్రాక్షా రసం, వారి మతి పోగొట్టాయి.
12నా ప్రజలు తాము పెట్టుకున్న చెక్క బొమ్మల దగ్గర విచారణ చేస్తారు.
13వారు పర్వత శిఖరాల మీద బలులర్పిస్తారు.
14మీ కుమార్తెలు చేసే లైంగిక దుర్మార్గతను బట్టి నేను వారిని శిక్షించను.
15ఇశ్రాయేలూ, నీవు వేశ్యవైపోయావు.
16పొగరుబోతు పెయ్యలాగా ఇశ్రాయేలువారు మొండిగా ప్రవర్తించారు.
17ఎఫ్రాయిము విగ్రహాలతో ఏకమయ్యాడు.
18వారికి ద్రాక్షారసం లేకుండా పోయినా,
19సుడిగాలి వారిని చుట్టబెట్టుకు పోతుంది.