1ఆయన నాకు ఏమి సెలవిస్తాడో, నా వాదం విషయమై నేనేమి చెబుతానో చూడడానికి నేను నా కావలి స్థలంపైనా గోపురంపైనా కనిపెట్టుకుని ఉంటాననుకున్నాను.
2యెహోవా నాకు ఇలా చెప్పాడు. చదివేవాడు పరిగెత్తేలా,
3ఆ దర్శన విషయం రాబోయే కాలంలో జరుగుతుంది. అది ఎంత మాత్రం విఫలం కాదు.
4మనిషి ఆత్మ తనలో తాను ఉప్పొంగుతుంది. అది యథార్థంగా ఉండదు.
5ద్రాక్షారసం2:5 ద్రాక్షారసం నంపద గర్విష్టి యువకుణ్ణి మోసం చేసి నిలవననీయకుండా చేస్తుంది.
6తనది కాని దాన్ని ఆక్రమించి అభివృద్ధి పొందిన వాడికి బాధ.
7పళ్ళు కొరికే వారు హటాత్తుగా వస్తారు.
8నువ్వు అనేక రాజ్యాలను దోచుకున్నావు కాబట్టి మిగిలిన ప్రజలంతా నిన్ను దోచుకుంటారు.
9తనకు అపాయం రాకుండా తన నివాసాన్ని ఎత్తుగా చేసుకుని,
10నీవు చాలా మంది జనాలను నాశనం చేస్తూ నీ మీద నీవే అవమానం తెచ్చుకున్నావు.
11గోడల్లోని రాళ్లు మొర్ర పెడుతున్నాయి.
12రక్తపాతం మూలంగా పట్టణం కట్టించే వారికి బాధ.
13జాతులు ప్రయాసపడతారు గాని అగ్ని పాలవుతారు.
14ఎందుకంటే సముద్రం జలాలతో నిండి ఉన్నట్టు భూమి యెహోవా మహాత్మ్యాన్ని గూర్చిన జ్ఞానంతో నిండి ఉంటుంది.
15తమ పొరుగు వాణ్ణి నగ్నంగా చూడాలని విషం కలిపి వారికి తాగించి వారిని మత్తులుగా చేసేవారికి బాధ.
16ఘనతకు మారుగా అవమానంతో నిండిపోతావు.
17లెబానోనునకు నీవు చేసిన బలాత్కారం నీ మీదికే వస్తుంది.
18చెక్కిన విగ్రహం వల్ల నీకు ప్రయోజనమేమిటి?
19కర్ర విగ్రహాలను చూసి మేలుకో అనీ, మూగరాతి ప్రతిమలను చూసి లే అనీ చెప్పేవాడికి బాధ.
20అయితే యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు.